ప్రధానాంశాలు
- చెన్నై సూపర్ కింగ్స్
- కెప్టెన్: ఎంఎస్ ధోని
- కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్
- హోమ్ గ్రౌండ్: MA చిదంబరం స్టేడియం, చెన్నై
- IPL టైటిల్స్: 4 (2010, 2011, 2018, 2021)
- యజమానులు: చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (ఇండియా సిమెంట్స్ అనుబంధ సంస్థ)
అత్యంత స్థిరమైన IPL ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ జట్టుకు MS ధోని నాలుగు టైటిళ్లు అందించారు. రెండుసార్లు మాత్రమే నాల్గవ స్థానానికి దిగువన నిలిచారు. చెన్నై ఫ్రాంచైజీ ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలో ఉంది, దీనికి మాజీ బిసిసిఐ అధ్యక్షుడు, ఐసిసి మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ఛైర్మన్. CSKను 2008లో రూ. 360 కోట్లకు (సుమారు US$91 మిలియన్లు) కొనుగోలు చేశారు.
చరిత్ర

చెన్నై సూపర్ కింగ్స్ తాను ఆడిన 13 IPL సీజన్లలో 11 సార్లు నాకౌట్కు చేరుకుంది. ప్రారంభ వేలంలో అత్యధికంగా చెల్లించిన ఆటగాడిగా (రూ. 9.5 కోట్లు, సుమారు US$1.5 మిలియన్లు) ధోని నిలిచాడు, అతను జట్టుకు ఆత్మ. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యూహాత్మక నిర్ణయాలు.. సంవత్సరాలుగా సూపర్ కింగ్స్ విజయానికి దోహదపడ్డాయి.
2008లో చివరి బంతికి ఫైనల్ను, 2009లో సెమీ-ఫైనల్ను కోల్పోయిన తర్వాత, సూపర్ కింగ్స్ తర్వాతి రెండు సీజన్లలో వరుసగా టైటిల్లను కైవసం చేసుకుంది. వారు తదుపరి నాలుగు IPLలలో నాకౌట్కు చేరడం విశేషం. అయితే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా రెండేళ్లపాటు నిషేధానికి గురయ్యారు. అయితే, 2018లో, సూపర్ కింగ్స్ వారి మూడవ టైటిల్తో తమ పునరాగమనాన్ని ఘనంగా చాటింది. అయితే వారి జట్టు 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు.
2019లో, సూపర్ కింగ్స్ వారి చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్తో ఉత్కంఠభరితమైన ఫైనల్ ఆడింది, చివరికి రోహిత్ శర్మ అండ్ కో వారిపై ఒక పరుగుతో విజయం సాధించారు. మరుసటి సంవత్సరం, వారు UAEలోని పరిస్థితులకు సర్దుబాటు కావడానికి చాలా కష్టపడ్డారు. పాయింట్ల పట్టికలో దిగువకు చేరుకున్నారు. అయితే తర్వాతి సీజన్లో తిరిగి పుంజుకున్నారు. లీగ్ దశలో రెండవ స్థానంలో నిలిచారు. ఆపై ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించారు. అయితే, 2022లో ఓడిపోయారు.
ఉత్తమ ఆటతీరు
2018 వేలం తర్వాత సూపర్ కింగ్స్ను “డాడీస్ ఆర్మీ” అని ట్రోల్ చేశారు. కానీ వారు ఆ విమర్శలు తప్పని నిరూపించారు. చెన్నై జట్టులో 30 ఏళ్లకు పైబడిన అనేక మంది స్టార్లలో ఒకరైన,షేన్ వాట్సన్, ఫైనల్లో అజేయంగా సెంచరీతో మెరిశాడు. తమ జట్టుకు మూడవ IPL కిరీటాన్ని అందించారు. రెండు సంవత్సరాల సస్పెన్షన్ నుండి మెరుగైన పునరాగమనం తర్వాత అంతగా ఆకట్టుకోకున్నా… 2021లో టైటిల్ను కైవసం చేసుకున్నారు.
పేలవమైన ఆటతీరు
మోసం, ఫోర్జరీ ఆరోపణలపై శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ను అరెస్టు చేయడంతో CSK పై వేటు పడింది. రెండేళ్ల తర్వాత, మెయ్యప్పన్ కార్యకలాపాల కారణంగా సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా సస్పెండ్ చేశారు.. అయితే పునరాగమనాన్ని ఘనంగా చాటిన చెన్నైకి 2020లో చెత్త సీజన్. వారి చరిత్రలో మొదటిసారిగా ప్లేఆఫ్లకు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
సీజన్ వారీగా
2008 – రన్నరప్
చెన్నై సూపర్ కింగ్స్ సీమర్లు, ధోని, సురేశ్ రైనాల బ్యాటింగ్తో సూపర్ కింగ్స్ 14 లీగ్ గేమ్లలో ఎనిమిది విజయాలు సాధించి సెమీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను సులభంగా ఓడించింది. CSK యొక్క సీమర్లు, ముత్తయ్య మురళీధరన్ ప్రతిభతో ఫైనల్కు చేరుకున్నారు. అయితే షేన్ వార్న్, సోహైల్ తన్వీర్ రాజస్థాన్ రాయల్స్కు మొదటి టైటిల్ను అందించారు.
2009 – నాల్గవ స్థానం
ఈ సీజన్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. అక్కడ మాథ్యూ హేడెన్, రైనా, మురళీలు కలిసి సూపర్ కింగ్స్ జట్టును పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిపారు. అయితే సెమీఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని స్థానిక కుర్రాళ్లు మనీష్ పాండే, వినయ్ కుమార్ ఉత్తమంగా నిలిచారు.
2010 – ఛాంపియన్స్

2010లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ముంబయి ఇండియన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 168 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి 146/9కే పరిమితమైంది. దీంతో.. 22 పరుగుల తేడాతో ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు టైటిల్ గెలిచింది.
2011 – ఛాంపియన్స్

2011లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అలవోక విజయంతో టైటిల్ను ఎగరేసుకుపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 147/8తోనే సరిపెట్టింది. దీంతో.. 58 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది.
2012 – రన్నరప్
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు లీగ్ దశలో 8 విజయాలలో ఐదు సొంత మైదానంలో వచ్చాయి. ఆపై మురళీ విజయ్ ఢిల్లీ డేర్డెవిల్స్పై సెంచరీతో తమ జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. CSKని ఫైనల్కి తీసుకెళ్లాడు. ఆ ఫైనల్లో విజయ్, మైక్ హస్సీ, రైనా అందరూ బాగా రాణించారు, కాని మన్విందర్ బిస్లా అద్భుత ఆటతీరుతో ధోని జట్టుకు హ్యాట్రిక్ టైటిల్ను అందకుండా చేశాడు.
2013 – రన్నరప్
ఈ సీజన్లోనూ చెన్నై జట్టు ఏడు-మ్యాచ్ల్లో విజయం సాధించి క్వాలిఫైయర్లోకి వచ్చారు. ఆ సీజన్లో హస్సీ మెరుపు ఇన్నింగ్స్ 86 నాటౌట్తో ముంబైని ఓడించాడు, అదే ప్రత్యర్ధితో టైటిల్ పోరులో తలపడ్డారు. ఫైనల్లో సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 148 పరుగులు చేయగా.. అనూహ్యంగా చెన్నై 125/9కే పరిమితమైంది.
2014 – మూడవ స్థానం
ఈ సీజన్ అబుదాబిలో కింగ్స్ ఎలెవన్తో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై జట్టు 4 వికెట్లకు 205 పరుగులు చేసినప్పటికీ CSK ఓడిపోయింది. అయితే ప్లేఆఫ్లకు వెళ్లే క్రమంలో వారు తమ తదుపరి తొమ్మిది గేమ్లలో ఎనిమిదింటిని గెలిచారు. స్థానిక వివాదం కారణంగా హోమ్ మ్యాచ్లు రాంచీకి మార్చారు. రెండో క్వాలిఫయర్లో కింగ్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో రైనా 25 బంతుల్లో 87 పరుగులు చేశాడు, అయితే అది వారిని ఫైనల్కు తీసుకెళ్లేందుకు సరిపోలేదు.
2015 – రన్నరప్
ఈ సీజన్లో చెన్నైజట్టు, ఏడు హోమ్ మ్యాచ్లలో ఆరింటిలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు, ఆపై రెండవ క్వాలిఫయర్లో RCBని ఓడించారు. అయితే ఫైనల్లో ముంబై రెండోసారి సీఎస్కేపై విజయం సాధించింది. ఇది సీమర్లు ఆధిపత్యం వహించిన IPL, సూపర్ కింగ్స్ యొక్క డ్వేన్ బ్రావో వికెట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ఆశిష్ నెహ్రా నాల్గవ స్థానంలో ఉన్నారు.
2016, 2017 – ఐపీఎల్ నుంచి సస్పెండ్

2018 – ఛాంపియన్స్

2018లో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మూడోసారి విజేతగా నిలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో షేన్ వాట్సన్ అసాధారణ శతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో మ్యాచ్లో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 178 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని చెన్నై కేవలం 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించేసింది.
2019 – రన్నరప్
ఈ సీజన్లో చెన్నై జట్టు లీగ్ దశలో ఏడు హోమ్ గేమ్లలో ఆరు విజయాలు సాధించింది. ముంబై చేతిలో ఒకే ఒక పరాజయం ఎదురైంది, 2019లో, సూపర్ కింగ్స్ వారి చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్తో ఉత్కంఠభరితమైన ఫైనల్ ఆడింది, చివరికి రోహిత్ శర్మ అండ్ కో వారిపై ఒక పరుగుతో విజయం సాధించారు.
2020 – ఏడవ స్థానం
రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ నుండి వైదొలిగిన తర్వాత, సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకోకూడదని నిర్ణయించుకుంది. మిడిల్ ఆర్డర్లో ధోనీ, కేదార్ జాదవ్ పోరాడారు. అయినా ఏడవ స్థానంతో సరిపెట్టుకున్నారు.
2021 – ఛాంపియన్స్

రెండు ఫేజుల్లో జరిగిన ఐపీఎల్ 2021వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచింది. కీలకమైన తుదిపోరులో కేకేఆర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో సీఎస్కే చేతిలో పరాజయం మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఓపెనర్లు ఇద్దరూ అర్ధ శతకాలతో మంచి ఆరంభం ఇచ్చినా ఫలితం దక్కలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్పై సీఎస్కే 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగో ఐపీఎల్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. డుప్లెసిస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (635) టాప్ స్కోరర్గా. నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
2022 – తొమ్మిదవ
ఈ సీజన్లో దీపక్ చాహర్, ఆడమ్ మిల్నేలకు గాయాలు సూపర్ కింగ్స్ జట్టు బ్యాలెన్స్ను దెబ్బతీశాయి. సీజన్ ప్రారంభంలో బౌలింగ్ మెరుగుపరుచుకునేందుకు తమ విదేశీ ఓపెనర్ డెవాన్ కాన్వేని త్యాగం చేయాల్సి వచ్చింది. ధోని నుండి రవీంద్ర జడేజా కెప్టెన్సీని స్వీకరించాడు. అయితే టోర్నమెంట్ మధ్యలో తిరిగి పగ్గాలను అప్పగించాడు. ఆ తర్వాత జడేజా గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ దిగువ నుంచి రెండో స్థానంలో నిలిచింది.
కీలక ఆటగాళ్ళు
ఎంఎస్ ధోనీ (కెప్టెన్), బెన్ స్టోక్స్, డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, దీపక్ చాహర్.